Wednesday 11 June 2014

హిమాచల్ భాదితులకు పవన్ చేయూత



పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ మాత్రమే కాదు మనసున్న మనషి అని కూడా అనిపించుకోవడంలో ముందుంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విహారయాత్రకు పోయి మృత్యు ఒడికి చేరిన 24 మంది తెలుగు విద్యార్ధులకు సహాయం చేయడానికి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. ఈ వార్త విన్న పవన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. సోమవారం తను వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ సినిమా ముహూర్తం జరిగిన వెంటనే అయన హిమాచల్ ప్రదేశ్ కి బయలుదేరి వెళ్ళారు. అంతేకాకుండా చనిపోయిన వారీ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల విరాళాలు కూడా ఇస్తున్నారు.

నటనతో ప్రజలను అలరించడమే కాదు, మంచి పనులు చేసి అవసరంలో ఉన్న వారీని అధికోవడంలో పవన్ ఎప్పుడు ముందు ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఉత్తరాఖండ్ వరద భాధితులకు కూడా 24 లక్ష విరాళాలను పవన్ అందించాడు. అంతకు ముందు ఆసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రణీతను కూడా పవన్ ఆదుకున్నాడు. ఆమెలో మనోధైర్యాన్ని పెంచాడు. ఇదే మరి పవనిసం అంటే.

No comments:

Post a Comment